దుబాయ్ : వచ్చే యేడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ గురువారం ఆవిష్కరించింది. వచ్చే యేడాది పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలను నిర్వహించనున్నారు. పురుషుల ప్రపంచకప్ వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించనుండగా, మహిళల ప్రపంచకప్ను బంగ్లాదేశ్ నిర్వహించనున్నది.
బ్యాట్, బంతి, ఎనర్జీలను ప్రతిబింబించేలా లోగోను రూపొందించారు. అంతేగాక నిర్వాహక దేశాల పేర్లనుకూడా పొందుపరిచారు. బ్యాట్, బంతితోపాటు ఎనర్జీని గుర్తుచేసేలా రూపొందించిన లోగో అభిమానులను అలరింస్తుందని ఐసీసీ జనరల్ మేనేజర్(మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్) క్లెయిర్ ఫర్లాంగ్ తెలిపారు.