Rishabh Pant | భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ బ్యాట్పట్టి మైదానంలోకి దిగాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 152 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్లో భారత జట్టులో చోటుపై దక్కుతుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుతమైన ఫామ్తో భారత జట్టులో పునరాగమనం వైపు అడుగులు వేస్తున్నట్లు క్లార్క్ పేర్కొనాడు. రోడ్డు ప్రమాదం నుంచి అద్భుతంగా కోలుకున్నాడంటూ ప్రశించాడు. ప్రశంసకు అర్హుడని.. హార్డ్వర్క్ మైదానంలో చూడడం.. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, కీపింగ్ చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఐపీఎల్లో పునరాగమనంతో రిషబ్ పంత్ 158.33 స్ట్రయిక్తో 150కిపైగా పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లున్నాయి.
ఈ ఏడాది జూన్లో వెస్టిండిస్, అమెరికా సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ నిర్వహించనున్నారు. పొట్టి కప్కు ముందే రిషబ్ పంత్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ.. కోల్కతాతో మ్యాచ్ సందర్భంగా ఫిజియో ఒకటి రెండుసార్లు మైదానంలోకి వచ్చాడు. రిషబ్ ఫిట్గా ఉన్నాడని ఆశిస్తున్నట్లు క్లార్క్ పేర్కొన్నాడు. మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ పార్టీలో బాగానే కనిపించాడని.. తదుపరి మ్యాచ్లకు సైతం ఫిట్గా ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ నెల 3న కోల్కతా నైటరైడర్స్తో తలపడింది. కోల్కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆ తర్వాత బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 17.2 ఓటర్లలో 166 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్లో పంత్ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. 25 బంతుల్లో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్యాట్తో చెలరేగినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్కు రూ.24లక్షల జరిమానా విధించారు.