లండన్: టీమ్ఇండియా పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొననున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఉనాద్కట్.. కౌంటీల్లో ససెక్స్ జట్టు తరఫున బరిలో దిగనున్నాడు.
ఇప్పటికే ససెక్స్ జట్టులో వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఉండగా.. ఉనాద్కట్ రెండో భారత ప్లేయర్ కానున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే తన బాధ్యత అని ఉనాద్కట్ పేర్కొన్నాడు.