Suresh Raina on KL Rahul | సౌతాఫ్రికాతో మూడు రోజుల్లో మొదలయ్యే ఐదు టీ-20ల సిరీస్లో టీం ఇండియాను సారధిగా కేఎల్ రాహుల్ అద్భుతంగా నడుపుతాడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో లక్నో ఫ్రాంచైసీ సారధిగా తొలిసారే జట్టును ప్లేఆప్స్కు తీసుకెళ్లాడు. కనుక వచ్చే సిరీస్లో టీం ఇండియాను విజయవంతంగా నడిపిస్తాడని రైనా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
గురువారం నుంచి సౌతాఫ్రికాతో టీం ఇండియా టీ-20 సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్కు సారధి రోహిత్శర్మతోపాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రధాన ప్లేయర్లు దూరంగా ఉన్నారు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో వీరికి టీమ్ యాజమాన్యం విశ్రాంతి కల్పించింది. కనుక సౌతాఫ్రికా సిరీస్లో టీమ్కు కేఎల్ రాహుల్ సారధ్యం వహించబోతున్నాడు.
టీం ఇండియాలో ఇప్పటి ఆటగాళ్లకు కేఎల్ రాహుల్ వంటి సారధే కావాలని రైనా చెప్పాడు. బౌలర్లలో కులదీప్, యుజ్వేంద్ర చాహల్ వంటి స్పిన్నర్లు, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని తెలిపాడు. మిడిలార్డర్లో రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్ వంటి హిట్ బ్యాట్స్మన్లు ఉన్నారని, వీరందరు ఐపీఎల్లో బాగా ఆడారని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా ప్లేయర్లు కూడా బాగానే ఆడుతున్నందున ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.