Sunil Chhetri : భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) స్వదేశంలో జరుగుతున్న దక్షిణాసియా చాంపియన్షిప్(SAFF Championship 2023)లో అదరగొడుతున్నాడు. పాకిస్థాన్పై హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన అతను జట్టును సెమీస్(Semi Finla)కు చేర్చాడు. తాజాగా అతను తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో ఫుట్బాల్కు వీడ్కోలు పలకాలనే ఆలోచన తనకు లేదని అన్నాడు. ‘దేశం తరఫున నా ఆఖరి మ్యాచ్ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. అయితే.. జట్టుకు నా వంతు సహకారం అందిస్తున్నానా? లేదా?
అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటా. కుటుంబసభ్యులు పదే పదే రిటైర్మెంట్ గురించి అడుగుతుంటా రు. అప్పుడు వాళ్లకు నా ఫుట్బాల్ గణాంకాలు చూపిస్తా’ అని ఛెత్రీ తెలిపాడు. టీమిండియా ఫుట్బాల్కు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఘనత కచ్చితంగా ఛెత్రీకి చెందుతుంది. మరో విషయం ఏంటంటే… అతడి కెప్టెన్సీలో భారత జట్టు తన ఫిఫా ర్యాంకింగ్(FIFA Ranking) మెరుగుపరుచుకుంది. ఐదేళ్ల తర్వాత వందలోపు ర్యాంకు సాధించింది. శాఫ్ చాంపియన్షిప్ ముందు టీమిండియా 101వ ర్యాంక్లో ఉండేది. ప్రస్తుతం వందో స్థానంలో నిలిచింది.
మరోవైపు.. ఈ టోర్నీలో ఇప్పటికే 22 గోల్స్ కొట్టిన ఛైత్రీ మరో రికార్డుపై కన్నేశాడు. భారత కెప్టెన్ ఒక్క గోల్ కొడితే మాల్దివ్స్ లెజెండ్ అలీ అష్ఫక్ (Ali Ashfaq) సరసన చేరతాడు. అష్ఫక్ 23 గోల్స్తో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఛెత్రీ ఖాతాలో 22 గోల్స్ ఉన్నాయి. శాఫ్ చాంపియన్షిప్లో భారత జట్టు సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఫైనల్ బెర్త్ కోసం రేపు సాయంత్రం లెబనాన్(Lebanon) జట్టును ఢీ కొట్టనుంది.