హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో రెజ్లింగ్కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం హింద్ కేసరి రెజ్లింగ్ పోటీల ముగింపు వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెజ్లింగ్ అకాడమీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.
పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు రెజ్లింగ్లో శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. క్రీడా పాఠశాలలో రెజ్లింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందిస్తున్నామన్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకు మెడల్స్ అందజేశారు.