అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్ల పతకాల వేట కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పురుషుల కే-4 1000మీటర్ల కనోయింగ్లో రాష్ట్ర జట్టుకు కాంస్య పతకం దక్కింది. హరీశ్ కుమార్, మహేంద్రసింగ్, కునాల్, నివాశ్సింగ్తో కూడిన తెలంగాణ టీమ్ రేసును 1.39.16 సెకన్లలో ముగించింది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు(ఎస్ఎస్సీబీ), మధ్యప్రదేశ్ వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నాయి.