మహబూబ్నగర్టౌన్: క్రీడారంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. క్రీడల్లో దేశంలో రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలుపుతామన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2000పైగా గ్రామాల్లో క్రీడా మైదానాలను పూర్తి చేశామన్నారు. మైదానాలను ఏర్పాటు చేయడంతో పాటు క్రీడా సామగ్రిని కూడా అందించినట్లు చెప్పారు.
కామన్వెల్త్ గేమ్స్లో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. అనంతరం పీఈటీలు, ప్రజాప్రతినిధులతో కలిసి సరదాగా టగ్ఆఫ్ వార్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న పాల్గొన్నారు.