సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో కీలకమైన టెస్టు సిరీస్లో భారత క్యాంప్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శుక్రవారం స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. కోహ్లీ కుటుంబంలో ఎలాంటి ఎమర్జెన్సీ ఉందన్న విషయంలో బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అయితే ఈ నెల 26నుంచి ఇరు జట్ల మధ్య మొదలయ్యే తొలి టెస్టు నాటికి తిరిగి జట్టుతో చేరుతాడని టీమ్ఇండియా మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా క్యాచ్ అందుకునే క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ చేతి వేలికి గాయం అయిందని బోర్డు వర్గాలు తెలిపాయి.