ODI WC 2023 : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలనుకున్న శ్రీలంక(Srilanka) ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. న్యూజిలాండ్(Newzealand), శ్రీలంక జట్ల మధ్య ఈరోజు క్రిస్ట్చర్చ్లో జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో ఒక్క బంతి పడకుండానే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఇప్పటికే టెస్టు సిరీస్ ఓటమితో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశం కోల్పోయిన శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ జట్టు వరల్డ్ కప్ ఆవకాశాలపై ప్రభావం పడనుంది.
సూపర్ లీగ్లో టాప్ -8లో నిలిచిన జట్లు నేరుగా వరల్డ్ కప్కు క్వాలిఫై అవుతాయి. ఆఖరి రెండు స్థానాల కోసం పోటీ ఉంది. అయితే.. వెస్టిండీస్ జట్టు ఎనిమిదో ప్లేస్లో, శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇరుజట్లకు 6 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. దాంతో, వన్డే సిరీస్ గెలిచి వరల్డ్ కప్కు క్వాలిఫై అవ్వాలనుకున్న శ్రీలంక తొలి వన్డేలో చిత్తుగా ఓడిపోయింది. రెండో వన్డేలో విజయంపై కన్నేసిన ఆ జట్టుకు వరుణుడు షాకిచ్చాడు.
ఆక్లాండ్లో జరిగిన మొదటి వన్డేలో కివీస్ 198 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో మూడు వన్డేల సిరీస్లో1-0 ఆధిక్యంలో ఉంది. కీలకమైన రెండో వన్డే వర్షార్ఫణం కావడంతో ఆఖరి వన్డేపై శ్రీలంక భారీ ఆశలు పెట్టుకుంది. శ్రీలంక 1996లో వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 2011 వరల్డ్ కప్లో ఫైనల్లో చేరిన ఆ జట్టు భారత్ చేతిలో ఓటమి పాలైంది.
సూపర్ లీగ్(ICC Mens World Cup Super League)లో న్యూజిలాండ్ 165 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్(155 పాయింట్లు), భారత్(139 పాయింట్లు), బంగ్లాదేశ్(130 పాయింట్లు) వరుసగా రెండ, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్(130 పాయింట్లు) ఐదో ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా 120 పాయింట్లతో ఆరో ప్లేస్లో నిలిచింది. అఫ్గనిస్థాన్(115 పాయింట్లు), వెస్టిండీస్(88 పాయింట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ – నబంబర్ మధ్య భారత్లో జరగనుంది.