కొలంబో: శ్రీలంక-భారత్ మధ్య ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం జరిగిన చివరి, మూడో వన్డే మ్యాచ్లో టీం ఇండియాపై శ్రీలంక విజయం సాధించింది. టీం ఇండియా నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని 39 ఓవర్లలోనే ఏడు వికెట్లు కోల్పోయి చేధించింది.
డక్ అండ్ వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ను శ్రీలంక గెలుచుకున్నది. అయితే, ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించడంతో వన్డే సిరీస్ను భారత్ కైవశం చేసుకున్నది. మ్యాచ్లో శ్రీలంక ఓపెనర్ అలస్కా ఫెర్నాండో (76), బానుక రాజపక్స (65) పరుగులు సాధించి విజయంలో కీలకంగా వ్యవహరించారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47 ఓవర్లలో 225 పరుగులు చేసింది. 43.1 ఓవర్లో చమీరా వేసిన బంతికి సందీప్ సైనీ ఔటవ్వడంతో టీం ఇండియా ఇన్నింగ్స్కు తెర పడింది. మ్యాచ్ మధ్యలో వర్షం కురవడంతో ఆట నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాత ఓవర్లు కుదించి ఆట కొనసాగించారు.