బ్రిస్బేన్: టీ20 వరల్డ్కప్ గ్రూప్ 1 మ్యాచ్లో ఇవాళ శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ విసిరిన 145 లక్ష్యాన్ని శ్రీలంక ఈజీగా ఛేజ్ చేసింది. బ్యాటర్ ధనంజయ డిసిల్వా హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంక 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకున్నది. డిసిల్వా 42 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు.
Sri Lanka live to fight another day and knock Afghanistan out of the #T20WorldCup semi-final race.#AFGvSL | 📝: https://t.co/7wl55jzhXW
Head to our app and website to follow the #T20WorldCup action 👉 https://t.co/76r3b73roq pic.twitter.com/EhQ90BqROh
— ICC (@ICC) November 1, 2022
లంక బ్యాటర్లలో మెండిస్ 25, అసలంక 19, రాజపక్స 18 రన్స్ చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రెహ్మాన్కు రెండు, రషీద్ ఖాన్కు రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఈ విక్టరీతో గ్రూప్ వన్లో నాలుగు పాయింట్లతో శ్రీలంక మూడవ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ఓటమితో ఆఫ్ఘన్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యాయి. అయితే ఆసీస్, కివీస్ చేతిలో ఓడిన శ్రీలంక ఇంకా సెమీస్పై ఆశలు పెట్టుకున్నది.