సిల్హెట్(బంగ్లాదేశ్): బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. శనివారం ఆట ముగిసే సరికి లంక రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నె(52) మినహా అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.
బంగ్లా బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొంటూ కరుణరత్నె తన ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, భారీ సిక్స్తో ఆకట్టుకున్నాడు. రానా(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 32/3 తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 188 పరుగులకు కుప్పకూలింది.