కొలంబో: సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (141; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ చండిమాల్ (107) శతకాలతో రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది.
మాథ్యూస్, చండిమాల్తో పాటు దిముత్ కరుణరత్నె (77) రాణించాడు. అంతకుముందు అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌట్ కాగా.. ప్రస్తుతం లంక 212 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.