Spirit Of Cricket : వరల్డ్ కప్లో శ్రీలంక ఆటగాడు ఎంజెల్ మాథ్యూస్(Angelo Mathews s) అనూహ్యా రీతితో టైమ్డ్ ఔట్(Timed Out)గా వెనుదిదిరిగాడు. టైమ్డ్ ఔట్ కోసం బంగ్లాదేశ్ అప్పీలు చేయడంతో ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్'(Spirit Of Cricket) మరోసారి చర్చనీయాంశంగా మారింది. అప్పీల్ను వెనక్కి తీసుకోకపోవడంతో బంగ్లాదేశ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్కు తూట్లు పొడిచిందంటూ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు.
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) బంగ్లాదేశ్ అలా చేయడం సమర్థనీయం కాదనగా.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్లు బంగ్లా కెప్టెన్ తీరును తప్పుబట్టారు. ‘కామన్సెన్స్ అనేది లేదు. క్రికెట్ ఎటు వెళ్తోంది’ అంటూ పాక్ మాజీ సారథి మిస్బాహుల్ హక్ వ్యాఖ్యానించాడు.
Dramatic scenes in Delhi with Angelo Mathews becoming the first batter to be timed out in international cricket 👀
Details 👉 https://t.co/Nf8v8FItmh#BANvSL #CWC23 pic.twitter.com/VwjFfLHOQp
— ICC (@ICC) November 6, 2023
ఐసీసీ నియమాల ప్రకారం ఒక బ్యాటర్ ఔటయ్యాక.. కొత్తగా వచ్చే ఆటగాడు 2 నిమిషాల్లోపే క్రీజులో ఉండాలి. లేదంటే అతడిని ఔట్గా ప్రకటిస్తారు. బంగ్లాదేశ్ మ్యాచ్లో ఆల్రౌండర్ అంజెలో మాథ్యూస్ మైదానంలోకి వచ్చినప్పటికీ… హెల్మెట్ సరిగ్గాలేదనే కారణంతో బంతిని ఎదుర్కోవడం ఆలస్యం చేశాడు. దాంతో క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా మాథ్యూస్ రికార్డుల్లోకెక్కాడు.
ఎంజెల్ మాథ్యూస్
అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న మాథ్యూస్ తాను క్రీజులోకి వచ్చిన టైమింగ్ను సూచిస్తున్న ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఆ పరిస్థితుల్లో బంగ్లా కాకుండా మరే జట్టు అయినా అప్పీల్ను వెనక్కి తీసుకునేదని మండిపడ్డాడు. అయితే.. బంగ్లా సారథి షకిబుల్ హసన్ మాత్రం నిబంధనలను లోబడే తాము ప్రవర్తించామని, అవసరమైతే ఐసీసీనే నియమాలను మార్చాలని వివరణ ఇచ్చాడు.
షకీబల్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో సమరవిక్రమ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. హెల్మెట్ సరిగ్గా లేకపోవడాన్ని గుర్తించాడు. వెంటనే డగౌట్లో ఉన్న సహచరులకు సైగ చేసి హెల్మెట్ తీసుకురమ్మన్నాడు. టైమ్ వేస్టు కావడాన్ని గుర్తించిన బంగ్లా కెప్టెన్ షకీబ్ ‘హౌ ఈజ్ దట్’ అంటూ అప్పీల్ చేశాడు. దీంతో లెగ్ అంపైర్తో చర్చించిన అంపైర్ మాథ్యూస్తో మాట్లాడాడు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, మాథ్యూ స్ గార్డ్ తీసుకోకపోవడంతో అతడిని ఔట్గా ప్రకటించాడు.ఈ మ్యాచ్లో బంగ్లా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు షేక్హ్యాండ్ ఇచ్చుకోలేదు. మెగా టోర్నీలో ఆరో ఓటమితో చాంపియన్స్ ట్రోఫీ 2025లో సైతం వెనకబడిన లంక నవంబర్ 9న న్యూజిలాండ్తో తలపడనుంది.