క్రైస్ట్చర్చ్: తొలి నాలుగు మ్యాచ్ల్లో కనీస ప్రతిఘటన కనబర్చలేక సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్.. న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో ఓదార్పు విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఐదో టీ20లో పాకిస్థాన్ 42 పరుగుల తేడాతో కివీస్ను ఓడించి వైట్వాష్ నుంచి బయటపడింది. మొదట పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
రిజ్వాన్ (38) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్, సోధి తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్ (26) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో ఇఫ్తిఖార్ 3, కెప్టెన్ షాహీన్ అఫ్రిది నవాజ్ చెరో 2 వికెట్లు తీశారు.