భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) చేసిన అభ్యర్థనను.. బీసీసీఐ అంగీకారం తెలిపింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో జరుగనున్న మూడో టీ20కి 20 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ బుధవారం తెలిపాడు.