IND vs RSA : దక్షిణాఫ్రికా, భారత జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్(ODI Series)కు తెరలేచింది. జొయన్నెస్బర్గ్లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(Aiden Markram) బ్యాటింగ్ తీసుకున్నాడు. పొట్టి సిరీస్లో రాణించిన యంగ్స్టర్ నంద్రే బర్గర్ ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక టీమిండయా తరఫున సాయి సుదర్శన్(Sai Sudarshan) డెబ్యూట్ క్యాప్ అందుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
భారత్ తుది జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్.
దక్షిణాఫ్రికా తుది జట్టు : రీజా హెండ్రిక్స్, టోని డె జొర్జి, వాన్ డస్సెన్, ఎయిడెన్ మర్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, పెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, నంద్రే బర్గర్, తబ్రేజ్ షంసీ.