South Africa-India | గబెరాలో మంగళవారం భారత్తో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జోర్జీ 119 పరుగులు, హెండ్రిక్స్ 52, డస్సెన్ 36 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ మూడు వికెట్లు, కేశవ్ మహరాజ్, బౌరాన్ హెండ్రిక్స్ చెరో రెండు, లిజాడ్ విలియమ్స్, అడైన్ మక్రం చెరో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.2 ఓవర్లలోనే 211 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ 62 పరుగులు, కేఎల్ రాహుల్ 56 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పరుగులు చేయలేక విఫలమయ్యారు. దీంతో సఫారీలు మూడు వన్డేల సిరీస్ను 1-1 పాయింట్లతో సమం చేశారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, రింకూ సింగ్ చెరో వికెట్ తీశారు. సిరీస్ ను సమం చేసే మూడో వన్డే ఈ నెల 21న జరుగనున్నది.