జొహాన్నెస్బర్గ్: వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 284 పరుగుల తేడాతో గెలుపొందింది. విజయానికి 391 పరుగులు చేయాల్సిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 106 పరుగులకే కుప్పకూలింది.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో జోషువా డిసిల్వా(34)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. తక్కిన వారిలో బ్రాత్వైట్(18), జాసన్ హోల్డర్(19), అల్జరి జోసెఫ్(18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హామర్, కోట్జీ చెరి 3, రబాడ, మహారాజ్ చెరి 2 వికెట్లు పడగొట్టారు.