జొహన్నెస్బర్గ్: టీమ్ఇండియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం టెంబా బువుమా, కగిసో రబడకు విశ్రాంతినిచ్చారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్తో పాటు, వన్డే, టెస్టు సిరీస్లకు దక్షిణాఫ్రికా బోర్డు సోమవారం వేర్వేరు జట్లను ప్రకటించింది.
‘బవుమా, రబడకు టీ20, వన్డే సిరీస్ల నుంచి విశ్రాంతినిచ్చాం. టెస్టు సిరీస్కు వీరిద్దరూ అందుబాటులో ఉంటారు’ అని దక్షిణాఫ్రికా క్రికెట్ వెల్లడించింది. బవుమా గైర్హాజరీలో ఎయిడెన్ మార్క్మ్ పరిమిత ఓవర్ల సిరీస్ల్లో సఫారీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మూడు జట్లలో కలిపి పలువురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వగా.. పేసర్లు కోట్జీ, ఎంగిడి, జాన్సన్ను వన్డేల నుంచి విశ్రాంతినిచ్చారు.