Ajinkya Rahane | ఆస్ట్రేలియా పర్యటనలో తాను తీసుకున్న నిర్ణయాలకు ఇతరులెవరో క్రెడిట్ పొందారని టీం ఇండియా ప్లేయర్ అజింక్యా రహానే వ్యాఖ్యానించారు. 2020-21 ఆస్ట్రేలియా టూర్లో రెగ్యులర్ టీం సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరు కావడంతో అజింక్యా రహానే తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. తొలి టెస్ట్లో టీం ఇండియా ఓడిపోయింది. తర్వాత కోహ్లీ.. భారత్కు రావడంతో తాత్కాలిక కెప్టెన్గా రహానే తర్వాత జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్లకు సారధ్యం వహించాడు. 2-1 తేడాతో సిరీస్ టీం ఇండియా సొంతం చేశాడు. ఈ నేపథ్యంలో బ్యాక్ స్టేజ్ విత్ బొరియా అనే కార్యక్రమంలో అజింక్యా రహానే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆసీస్ పర్యటనలో తానేం చేశానో అందరికీ తెలుసునని, ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని రహానే స్పష్టం చేశాడు. ఆ విజయాన్ని చెప్పుకుని క్రెడిట్ కొట్టేయాలనుకోవడం తన స్వభావం కాదన్నారు. మైదానంలో తన నిర్ణయాల వల్లే టీం ఇండియా గొప్ప విజయాలు సాధించినా.. వాటి క్రెడిట్ ఇతరులెవరూ కొట్టేశారన్నాడు.
ఆసీస్పై జరిగే టెస్ట్ సిరీస్ను గెలుచుకోవడం జట్టుకు చాలా ముఖ్యం అని రహానే పేర్కొన్నాడు. ఆసీస్ గడ్డపై తాను సాధించిన చారిత్రక టెస్ట్ సిరీస్ చాలా ప్రత్యేకం. అయితే రహానే ఎవరి పేరు చెప్పకున్నా.. నాటి హెడ్ కోచ్ రవిశాస్త్రిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ఆసీస్ పర్యటన తర్వాత పలు ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఈ విజయం గురించి పదేపదే ప్రస్తావించడం గమనార్హం.