LPL Match | లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మ్యాచ్ను వీక్షించేందుకు ఓ ప్రత్యేక అతిథి మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది. దీంతో మ్యాచ్కు విరామం ఇవ్వాల్సి వచ్చింది. మామూలుగా తేనెటీగలు, పక్షులు, కుక్కల కారణంగా గతంలో మ్యాచ్లకు అంతరాయం వాటిల్లగా.. తాజాగా ఈ జాబితాలో మరో జీవి చేరింది. ఎల్పీఎల్ నాలుగో సీజన్లో భాగంగా సోమవారం గాలె టైటాన్స్, దంబుల్లా ఔరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఈ అరుదైన సంఘటనకు వేదికైంది. గాలె ప్లేయర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. దీంతో మ్యాచ్కు ఆటంకం వాటిల్లగా.. అప్రమత్తమైన అధికారులు దాన్ని బయటకు పంపి మ్యాచ్ను సజావుగా నడిపారు.
పాము మైదానంలో తిరుగుతున్న వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెట్టింట దీనిపై జోకులు పేలుతున్నాయి. ‘అసలు దీనికి టికెట్ ఎవరిచ్చారు?’ అని ఓ వ్యక్తి పేర్కొంటే.. ఇక ఇప్పటి నుంచి పాములకు నో ఎంట్రీ బోర్డు పెట్టాల్సిందే అని మరో నెటిజన్ స్పందించాడు. ఇక భారత వికెట్ కీపర్ బ్యాటర్ మరో అడుగు ముందుకు వేసి ‘నాగిన్ మళ్లీ వచ్చింది. బంగ్లాదేశ్ అని పొరబడిందేమో’ డీకే ట్వీట్ చేశాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు విజయం సాధించిన సమయంలో నాగిన్లా డాన్స్ చేయడం అలవాటు కావడంతో.. కార్తీక్ ఈ కామెంట్ చేసినట్లు అర్థమవుతోంది. మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ ఓవర్లో ఫలితం తేలిన ఈ మ్యాచ్లో దంబుల్లాపై గాలె జట్టు గెలుపొందింది.
The naagin is back
I thought it was in Bangladesh 🤣😂🤣😂🤣#naagindance#nidahastrophy https://t.co/hwn6zcOxqy
— DK (@DineshKarthik) July 31, 2023