ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): స్టార్ ఓపెనర్ స్మృతి మందన (51 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో విజృంభించడంతో ముక్కోణపు టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది.
వెస్టిండీస్తో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. స్మృతి, హర్మన్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చగా.. యష్తిక భాటియా (18), హర్లీన్ (12) పర్వాలేదనిపించారు. అనంతరం ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులకే పరిమితమైంది. స్మృతి మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి పోరులో శనివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.