మహిళా ప్రపంచకప్లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో.. టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 244/7 స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (52), దీప్తి శర్మ (40), స్నేహ్ రాణా (53), పూజా వస్త్రాకర్ (67) రాణించారు. ఆ తర్వాత భారత బౌలర్లంతా సమిష్టిగా రాణించడంతో పాక్ జట్టు 137 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్లో ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డే ఫార్మాట్లో 2500 పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్గా నిలిచింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ మిథాలీ రాజ్, అంజుమ్ చోప్రా, హర్మన్ప్రీత్ కౌర్ ఉన్నారు. వీరి తర్వాత ఇప్పుడు స్మృతి ఈ జాబితాలో చేరింది.
ప్రపంచకప్లో తొలి మ్యాచ్లోనే అర్ధసెంచరీతో రాణించిన స్మృతి ఫామ్.. ఈ టోర్నీలో భారత్కు కీలకం కానుంది. ఇప్పటికి చాలా సార్లు ప్రపంచకప్ ఫైనల్కు వెళ్లిన భారత్.. కప్పును మాత్రం ముద్దాడలేకపోయింది. అయితే ఈసారి అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉన్న జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగింది.
#ICYMI Smriti Mandhana completed 2500 ODI Runs earlier today:
Most runs for 🇮🇳INDIA in ODIs:
7623 – Mithali Raj
2856 – Anjum Chopra
2664 – Harmanpreet Kaur
2513 – Smriti Mandhana** 👈#TeamIndia #SmritiMandhana #CWC22 pic.twitter.com/oMmeJLK70n— Female Cricket #CWC22 (@imfemalecricket) March 6, 2022