Sachithra Senanayake : శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్రా సేనానాయకే(Sachithra Senanayake)కు భారీ షాక్ తగిలింది. మ్యాచ్ ఫిక్సింగ్(match-fixing) ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై కొలంబోలోని స్థానిక కోర్టు ఆంక్షలు విధించింది. సేనానాయకే విదేశాలకు వెళ్లడంపై 3 నెలల నిషేధం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియజేసింది. రెండేళ్ల క్రితం లంక ప్రీమియర్ లీగ్(2020 Lanka Premier League)లో సేనానాయకే మ్యాచ్ ఫిక్స్ంగ్కు పాల్పడ్డాడు.
టోర్నీ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిందిగా ఇద్దరు ఆటగాళ్లతో అతను ఫోన్లో మాట్లాడాడు. దాంతో అతడిపై కేసు నమోదైంది. ఆఫ్ స్పిన్నర్ అయిన సేనానాయకే బౌలింగ్ ఆల్రౌండర్గా శ్రీలంక జట్టులోకి వచ్చాడు. అయితే.. అతడి నాలుగేళ్లకే అతడి కెరీర్ ముగిసింది. 2012 నుంచి 2016 మధ్య అతను 49 వన్డేలు, 24 టీ20, ఒకే ఒక టెస్టు ఆడాడు.
సచిత్రా సేనానాయకే
అయితే.. 2014 జూలైలో ఇంగ్లండ్పై వివాదాస్పద బౌలింగ్ యాక్షన్( Illegal Bowling Action )తో సేనానాయకే వార్తల్లో నిలిచాడు. దాంతో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ మ్యాచుల్లో మళ్లీ బౌలింగ్ చేయకుండా ఐసీసీ అతడిపై నిషేధం విధించింది. అదే ఏడాది డిసెంబర్లో మళ్లీ సేనానాయకే బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది.