నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. మిర్యాలగూడ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పట్టణానికి చెందిన 206 మంది లబ్దిదారులకి రూ. 2,06,23,896 విలువ గల చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. అంతకుక్రితం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భాస్కర్ రావు మొక్కలు నాటారు.