IND vs NZ : మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (126) సెంచరీతో కదం తొక్కడంతో 20 ఓవర్లకు 234 రన్స్ చేసింది. టాప్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి (44) ఒక్కడే రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (24), హార్ధిక్ పాండ్యా (30) తక్కువకే ఔటయ్యారు. ఓపెనర్ ఇషాన్ (1) మరోసారి నిరాశ పరిచాడు. కివీస్ బౌలర్లలో బ్రాస్వెల్, టిక్నర్, సోధి, డారెల్ మిచెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
శుభ్మన్ సిక్సర్ల మోత
తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన శుభ్మన్ గిల్ కీలకమైన మూడో టీ20ల్లో విధ్యంసక ఇన్నింగ్స్ ఆడాడు. పొట్టి క్రికెట్లోనూ తొలి శతకం నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. 200 స్ట్రయిక్రేటుతో బ్యాటింగ్ చేసిన అతను అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని ఓరెత్తించాడు. 35 బంతుల్లో 50 రన్స్ చేసిన అతను ఆ తర్వాతి 19 బంతుల్లోనే శతకం చేయడం విశేషం. ఇషాన్ రెండో ఓవర్లోనే ఔటైనా కూడా గిల్ ఒత్తిడికి గురికాలేదు. రాహుల్ త్రిపాఠి (44)తో కలిసి 87 రన్స్ జోడించాడు. ఆ తర్వాత సూర్య, పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫెర్గూసన్, టిక్నర్తో పాటు కివీస్ మిగతా బౌలర్లను ఉతికి ఆరేస్తూ మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. బౌలింగ్లో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఆ జట్టుపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
3 ఫార్మాట్లో శతక వీరులు వీళ్లే
ఇండియా తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా శుభ్మన్ గిల్ నిలిచాడు. ఇంతకు ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ రికార్డు సాధించారు. వీళ్లు టెస్టులు, వన్డేలు, టీ20ల్లో శతకాలు బాదారు.