న్యూఢిల్లీ: భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. ప్రపంచకప్లో దాయాది పాకిస్థాన్ పోరుకు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఆస్ట్రేలియాతో తొలి పోరుకు ముందు అస్వస్థతకు గురైన గిల్.. అఫ్గానిస్థాన్తో బుధవారం జరగనున్న మ్యాచ్కు కూడా దూరమయ్యాడు.
అఫ్గాన్తో పోరు కోసం టీమ్ఇండియా ఢిల్లీ చేరిపోగా.. గిల్ మాత్రం చెన్నైలో ఉండిపోయాడు. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడంతో స్థానిక దవాఖానాలో చేరాడు. ఈ నెల 14న అహ్మదాబాద్ వేదికగా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరుగనున్న మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింఇ.