చెన్నై: శుభమన్ గిల్(Shubhman Gill) ఖాతాలో మరో సెంచరీ పడింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో అతను సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో అతనికి ఇది అయిదో సెంచరీ. చెన్నై టెస్టులో పంత్ సెంచరీ చేసి ఔట్ అయిన తర్వాత.. గిల్ సెంచరీ నమోదు చేశాడు. 160 బంతుల్లో అతను శతకాన్ని బాదాడు. రెండో ఇన్నింగ్స్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 287 రన్స్ చేసిన తర్వాత డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు 514 పరుగుల ఆధిక్యం లభించింది. రెండున్నర రోజుల్లో బంగ్లాదేశ్ గెలుపు కోసం 515 రన్స్ చేయాల్సి ఉంటుంది.
ఇవాళ ఉదయం పంత్, గిల్ను ఆడేసుకున్నారు. బంగ్లా బౌలర్లను బౌండరీలతో సతాయించారు. ఈజీగా స్కోర్ బోర్డును పరుగెత్తించారు. పంత్ తన వెరైటీ షాట్లతో అలరించగా, గిల్ మాత్రం తన ట్రేడ్మార్క్ షాట్స్తో నిలకడ ప్రదర్శించాడు. ఆ ఇద్దరి మధ్య 167 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. పంత్ 109 రన్స్ చేసి ఔటవ్వగా, గిల్ మాత్రం 119 రన్స్తో నాటౌట్గా నిలిచాడు.
And, that’s the declaration from the Indian Captain.
Shubman Gill and Rishabh Pant bring up their Test centuries as #TeamIndia gets to a total of 287/4 in the second innings.
Scorecard – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/Q7IBT1zlFm
— BCCI (@BCCI) September 21, 2024