అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఇండియా అతికష్టంగా పరుగులు సాధిస్తోంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 112 రన్స్ జోడించారు. కానీ అనూహ్య రీతిలో పంత్ 56 రన్స్ చేసి ఔటట్యాడు. ప్రస్తుతం ఇండియా 37.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు ఆరంభంలోనే కష్టాలు ఎదరయ్యాయి. ఓపెనర్ రోహిత్, కోహ్లీలు వెంటవెంటనే ఔటయ్యారు. అయ్యర్ 80 రన్స్ చేసి క్యాచ్ ఔటయ్యాడు.