ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా ఓపెనర్లు శుభ్మన్ గిల్, శిఖర్ ధవన్ జట్టు భారీ స్కోరుకు గట్టి పునాదులు వేశారు. నిలకడగా ఆడుతున్న శిఖర్ దవన్ 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా, మరో ఓపెనర్ గిల్ 50 పరుగులకు చేరువలో ఉన్నాడు. టీమ్ఇండియా 22 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది. శుభ్మన్ 63 బాల్స్లో 49 రన్స్, ధవన్ 71 బంతుల్లో 63 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
India are off to a great start as captain Shikhar Dhawan brings up his half-century 👏
Watch the #NZvIND ODI series LIVE on https://t.co/CPDKNxpgZ3 (in select regions) 📺
📝 Scorecard: https://t.co/KsjLsSQA4o pic.twitter.com/vAioy8rGfe
— ICC (@ICC) November 25, 2022