ముంబై: సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్కు పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohd. Shami) దూరం కానున్నాడు. రెండు టెస్టుల సిరీస్ నుంచి అతన్ని తప్పించినట్లు ఇవాళ బీసీసీఐ ప్రకటన చేసింది. తొలుత షమీని టెస్టు బృందం కోసం ఎంపిక చేసినా.. అతని ఫిట్నెస్ సరిగా లేని కారణంగా తప్పించారు. టెస్టు సిరీస్ కోసం మెడికల్ బోర్డు షమీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్.. వన్డే జట్టు నుంచి వైదొలిగాడు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణాల వల్ల వన్డే సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐకి దీపక్ చాహర్ చెప్పాడు. దీంతో అతన్ని తుది జట్టుకు ఎంపిక చేయడంలేదు. దీపక్ చాహర్ స్థానంలో ఆకాశ్ దీప్ను ఎంపిక చేశారు. ఆదివారం నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్నది. ఆ తర్వాత ఆ జట్టుతో డిసెంబర్ 26 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరగనున్నది.
🚨 NEWS 🚨
Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series.
Details 🔽 #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK
— BCCI (@BCCI) December 16, 2023