ఢాకా: త్వరలో జరుగనున్న వన్డే ప్రపంచకప్తో పాటు ఆసియాకప్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ సారథ్యం వహించనున్నాడు. వెన్నెముక గాయం కారణంగా తమీమ్ ఇక్బాల్ జట్టుకు దూరమవడంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సి వచ్చిందని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ శుక్రవారం తెలిపాడు.
‘కీలక టోర్నీల కోసం షకీబ్ను కెప్టెన్గా ఎంపిక చేశాం. త్వరలోనే జట్టును ప్రకటిస్తాం’అని నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. 2017లో చివరిసారిగా వన్డేల్లో సారథిగా వ్యవహరించిన షకీబ్.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు.