Shakib Al Hasan: బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ షకిబుల్ హసన్(Shakib Al Hasan) అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఐదు, అంతకంటే ఎక్కువ సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(player of the series award) అవార్డు గెలిచి తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈరోజు అఫ్గనిస్థాన్తో జరిగిన రెండో టీ20లో అతను రెండు వికెట్లు తీసి, ఆ తర్వాత 18 నాటౌట్తో జట్టును గెలిపించాడు. అందుకని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. టీ20ల్లో షకిబ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ బహుమతి రావడం ఇది ఐదోసారి.
దాంతో, వన్డేలు, టెస్టులు, టీ20లు.. ఈ మూడు ఫార్మాట్లలో ఐదు కంటే ఎక్కువ పర్యాయాలు ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. మరో విషయం ఏంటంటే..? భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(virat kohli), దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కు సైతం సాధ్యం కాని రికార్డును షకిబుల్ అందుకోవడం విశేషం. బంగ్లా కెప్టెన్ టెస్టుల్లో 5, వన్డేల్లో 7, టీ20ల్లో 5 పర్యాయాలు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎగరేసుకుపోయాడు.
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్
‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అత్యధికంగా గెలిచిన వాళ్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకూ 20 సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. టెస్టుల్లో 3, వన్డేల్లో 10, టీ20ల్లో ఏడు సార్లు విరాట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న సచిన్ టెస్టుల్లో 5, వన్డేల్లో 15 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ బహుమతి సాధించాడు. షకిబుల్ హసన్ ఇప్పటివరకూ 17 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్(Jacques Kallis) 15 సార్లు(టెస్టుల్లో 9, వన్డేల్లో 6), శ్రీలంక వెటరన్ ప్లేయర్ సనత్ జయసూర్య(Sanath Jayasuriya) 13 సార్లు(టెస్టుల్లో 2, వన్డేల్లో 11) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు.