హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్చంద్రను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహంతో కలిసి విరాట్ను మంత్రి సన్మానించారు. విరాట్ భవిష్యత్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో విరాట్ తల్లిదండ్రులు శరత్చంద్ర, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఎనిమిదేండ్ల విరాట్ టాంజానియాలోని కిలిమంజారో (5,895 మీ) పర్వతాన్ని అధిరోహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విరాట్కు బాల పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. కోచ్ భరత్ పర్యవేక్షణలో పర్వతారోహణ శిక్షణ పొందుతున్న విరాట్ ప్రస్తుతం సికింద్రాబాద్లోని గీతాంజలి దేవ్శాలలో మూడో తరగతి చదువుతున్నాడు.