హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జిల్లా సెపక్తక్రా చాంపియన్షిప్లో రంగారెడ్డి, హైదరాబాద్ జట్లు విజేతలుగా నిలిచాయి. విక్టరీ ప్లే గ్రౌండ్లో గురువారం జరిగిన టోర్నీలో మహిళల ఫైనల్లో రంగారెడ్డి 21-15, 21-16 తేడాతో నిజామాబాద్పై విజయం సాధించింది. మరోవైపు పురుషుల తుది పోరులో హైదరాబాద్ 21-18, 21-11 తేడాతో రంగారెడ్డిపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు, రాష్ట్ర సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, కార్యదర్శి ప్రేమ్రాజ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.