Paris Olympics | నసావు: భారత పురుషుల, మహిళల 4X400 రిలే జట్లు ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ బెర్తును దక్కించుకున్నాయి. నసావు (బహమస్) వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ రిలేస్లో భారత్కు రెండో స్థానం దక్కడంతో ఇరు జట్లకూ ఒలింపిక్స్ కోటా ఖరారైంది.
మహిళల విభాగం రెండో రౌండ్ హీట్ను తెలుగమ్మాయి జ్యోతికా శ్రీదండి, రూపాలీ చౌదరీ, ఎంఆర్ పూవమ్మ, సుభా వెంకటేషన్.. 3 నిమిషాల 29.35 సెకన్లలోనే పూర్తిచేసి జమైకా (3:28.54) తర్వాత రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు 4X400 రిలే రేసులో మహ్మద్ అనాస్, మహ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జాకబ్తో కూడిన పురుషుల జట్టు 3 నిమిషాల 3.23 సెకన్ల వ్యవధిలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. అమెరికా (2:59.95) అగ్రస్థానాన్ని దక్కించుకుంది.