హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? ఏ హక్కుతో గాంధీభవన్కు వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలని సవాల్ విసిరారు.
సోమవారం ఆమె గాంధీభవన్లో మాట్లాడుతూ.. నీరవ్మోదీ, చోక్సీ పారిపోయినట్టే, ప్రజ్వల్ కూడా విదేశాలకు పారిపోవడానికి అవకాశం కల్పించింది ఎవరని ప్రశ్నించారు. ప్రజ్వల్ను బలపరిస్తే తనను బలపరిచినట్టేనని మోదీ సిగ్గు లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.