క్రికెట్ దేవుడిగా అందరూ పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ ఆదివారం నాడు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లెజెండరీ బ్యాటర్, భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సచిన్కు వింతగా బర్త్డే విషెస్ చెప్పాడు. తాము క్రికెట్ ఆడే రోజులను గుర్తుచేసుకుంటూ.. అప్పట్లో ఇద్దరి మధ్య జరిగే సరదా ఘటనను వివరించాడు.
‘‘డ్రెస్సింగ్ రూంలో నుంచి మ్యాచ్ చూసేటప్పుడు నేను సైలెంట్గా ఉండాలని సచిన్ పాజీ కోరుకునేవాడు. నేను స్కోర్ చేసినా చెయ్యకపోయినా సైలెంట్గా ఉండాలనేవాడు. అందుకే నేను ఎక్కువ మాట్లాడకూడదని నాకు అరటిపండ్లు తినిపించేవాడు. అందుకని, ఈరోజు సచిన్ పుట్టినరోజు సందర్భంగా నేను తనకు పెద్ద గిఫ్ట్ ఇస్తున్నా. అదే నా సైలెన్స్. ఈరోజు నేను ఒక్క ముక్క కూడా మాట్లాడను. విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్ డే పాజీ.. ఈ రోజు నేను అరటిపండ్లు తింటా’’ అంటూ వీడియో షేర్ చేశాడు.
సచిన్ పుట్టిన రోజు అయిన ఆదివారమే.. ముంబై, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటం గమనార్హం. ఈ సీజన్ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ముంబై జట్టు.. ఈరోజైనా మ్యాచ్ గెలిచి సచిన్కు మంచి గిఫ్ట్ ఇస్తుందేమో చూడాలి.
Birthday greetings to the great man @sachin_rt Paaji.
Aur Aapke janamdin par yeh tohfa humne apne aap ko diya hai 😛 #HappyBirthdaySachin pic.twitter.com/knsIJ9Do2H— Virender Sehwag (@virendersehwag) April 24, 2022