Virender Sehwag : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) పెద్ద మనసు చాటుకున్నాడు. ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident)లో కన్నవాళ్లను కోల్పోయిన పిల్లలను చదవించేందుకు ముందుకొచ్చాడు. తాను నడుపుతున్న స్కూల్లో ఆ పిల్లలందరిని ఉచితంగా చదివిస్తానని తెలిపాడు. ఈ విషయాన్ని అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
‘ఈ విషాద సమయంలో నేను చేయగలిగిన అతి చిన్న సాయం ఏంటంటే.. ఈ ప్రమాదంలో కన్నవాళ్లను కోల్పోయి అనాథలైన పిల్లలను ఉచితంగా చదివిస్తా. వాళ్లకు సెహ్వాగ్ ఇంటర్నేషన్ స్కూళ్లలో వసతి సౌకర్యం కూడా కల్పిస్తాను’ అని వెల్లడించాడు. రైలు ప్రమాదానికి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. దానికి.. ‘ఈ ఫొటో మనల్ని చాలాకాలం వెంటాడుతుంది’ అని క్యాప్షన్ రాశాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన సెహ్వాగ్ కామెంటేటర్గా కొనసాగుతున్నాడు.
This image will haunt us for a long time.
In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility 🙏🏼 pic.twitter.com/b9DAuWEoTy
— Virender Sehwag (@virendersehwag) June 4, 2023
ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి మూడు రైళ్లు ఢీ కొనడంతో భారీ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి వెళ్లి గూడ్స్ రైలుని ఢీ కొట్టింది. ఆ తర్వాత పక్కనుంచి వెళ్తున్న యశ్వంతపూర్ – ఔరా బోగీలను గట్టిగా గుద్దింది. ఈ దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 280 మందిని పొట్టనబెట్టుకుంది. దాదాపు వెయ్యి మంది గాయపడ్డారు. వీళ్లలో కొందరి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. భారత రైల్వే చరిత్రలో అది పెద్ద ప్రమాదాల్లో ఇదొకటి.