న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే సఫారీ టూర్లో టీమ్ఇండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణా మండలి, క్రికెట్ దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేశాయి.
తొలి టీ20కి డర్బన్ ఆతిథ్యమివ్వనుండగా.. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు కేప్టౌన్లో జరిగే రెండో టెస్టుతో పర్యటన ముగియనుంది. మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్లో బాక్సింగ్ డే టెస్టు జరుగనుంది.