కోల్కతా: బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయం దిశగా సాగుతున్నది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులు చేయగా.. అనంతరం సౌరాష్ట్ర 404 రన్స్ కొట్టింది. అర్పిత్ (81), చిరాగ్ జానీ (60) రాణించారు.
బెంగాల్ బౌలర్లలో ముకేశ్ 4, ఇషాన్ పొరెల్, అక్ష్దీప్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 169 రన్స్ చేసింది. కెప్టెన్ మనోజ్ తివారి (57 బ్యాటింగ్), అనుస్తుప్ మజుందార్ (61) సత్తాచాటారు.