సిల్హెట్: లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఆరు వికెట్లతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్-‘ఏ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్-‘ఏ’ ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ప్రదర్శనతో బంగ్లాతో జరుగనున్న టెస్టు సిరీస్లో రవీంద్ర జడేజా స్థానాన్ని సౌరభ్ భర్తీ చేయగా.. రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-0తో చేజిక్కించుకుంది.
బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 526/9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో సౌరభ్ ధాటికి బంగ్లా 187 పరుగులకు ఆలౌటైంది. షాద్మన్ ఇస్లామ్ (93 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. భారత బౌలర్లలో ఉమేశ్, సైనీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.