BWF World Championships : వరల్డ్ చాంపియన్షిప్స్(World Championships)లో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj)- చిరాగ్ శెట్టి(Chirag Shetty) పోరాటం ముగిసింది. రెండో సీడ్గా బరిలోకి దిగిన వీళ్లు క్వార్టర్ ఫైనల్లో ఓటమితో ఇంటిదారి పట్టారు. డెన్మార్క్కు చెందిన 11వ సీడ్ కిమ్ అస్ట్రుప్(Kim Astrup), అండర్స్ రస్ముస్సెన్(Anders Rasmussen) చేతిలో 18-21, 19-21తో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దాంతో, వరల్డ్ చాంపియన్షిప్స్లో వరుసగా రెండో పతకం నెగ్గాలనుకున్న కల చెదిరింది. నిరుడు సాత్విక్ – చిరాగ్ కాంస్య పతకం అందుకున్నారు.
ఈ ఏడాది జోరు మీదున్న సాత్విక్ – చిరాగ్ వరల్డ్ చాంపియన్షిప్స్లోనూ అదరగొట్టారు. అయితే.. క్వార్టర్ ఫైనల్లో మాత్రం జోరు కొనసాగించలేకపోయారు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో భారత ద్వయం రెండో సెట్లో మ్యాచ్ పాయింటు గెలిచింది. అయితే.. ఆ తర్వాత వెనకబడింది.
So close yet so far!
📸: @badmintonphoto #BWFWorldChampionships#Copenhagen2023#BadmintonTwitter#Badminton pic.twitter.com/KEluC5VZEv
— BAI Media (@BAI_Media) August 25, 2023
సొంత ప్రేక్షకుల మద్దుతుతో చెలరేగిన అస్ట్రుప్, అండర్స్ వీళ్లకు మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ముగించారు. భారత జోడీపై వీళ్లకు ఇది ఆరో విజయం. ఇప్పటివరకూ సాత్విక్ – చిరాగ్ ఈ డెన్మార్క్ జోడీ 8 సార్లు తలపడ్డారు. వరల్డ్ చాంపియన్షిప్స్ ఇప్పటికే పీవీ సింధు(PV Sindhu), కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), లక్ష్య సేన్(Lakshya Sen) నిష్క్రమించారు. హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) ఒక్కడే క్వార్టర్స్ చేరి పతకంపై ఆశలు రేపాడు.