దుబాయ్ : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి సెమీఫైనల్స్కు చేరి 52 ఏళ్ల తరువాత పతకం ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సాత్విక్ జంట 21-11, 21-12తో అహ్సాన్-హెంద్రాను జోడీని ఓడించింది.
మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 21-18, 5-21, 9-21తో అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్-సిక్కిరెడ్డి క్వార్టర్ఫైనల్లో ఓటమి పాలయ్యారు.