Korea Open : కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్(Korea Open)లో గురువారం భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty)ద్వయం క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్(HS Pranay), ప్రియాంబ్షు రజావత్(Priyanbshu Rajawat) పోరాటం ముగిసింది. వీళ్లిద్దరూ రెండో రౌండ్లోనే అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
సాత్విక్ – చిరాగ్ చైనాకు చెందిన హి జిటింగ్, జో హోడాంగ్ను చిత్తు చేశారు. 43 నిమిషాల పారులో 21-17, 21-15తో గెలుపొందారు. వీళ్లు సెమీస్ పోరులో జపాన్కు చెందిన ఐదోసీడ్ తరుకో హోకి, యుగో కొబయషితో తలపడనున్నారు.
ప్రణయ్, ప్రియాంబ్షు రజావత్
కొరియా ఓపెన్లో ఐదో సీడ్గా బరిలోకి దిగిన ప్రణయ్ను హాంకాంగ్ ప్లేయర్ లీ చెకె యూ కాంగ్ చిత్తు చేశాడు. తనకంటే 8 ర్యాంకులు తక్కువ ఉన్న లీ చెకె చేతిలో 15-21 21-19 18-21తో ఓడిపోయాడు. రెండో సీడ్ కొడాయి నరోకతో హోరాహోరీగా తలపడిన ప్రియాంబ్షు రజావత్ ఆకట్టుకున్నాడు. స్వల్ప తేడాతో 14-21 21-18 17-21 పరాజయం మూటగట్టుకున్నాడు. వీరిద్దరి నిష్క్రమణతో సింగిల్స్లో పతకం ఆశలు గల్లంతయ్యాయి.