హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ నెల 16, 17 తేదీల్లో సాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల చెస్ టోర్నీ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో గురువారం పోటీలు ప్రారంభం కానుండగా, శుక్రవారం హైదరాబాద్ వేదికగా ఫైనల్ గేమ్స్ జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం హైదరాబాద్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ నిర్వహిస్తున్నాం. తొలుత అన్ని జిల్లాల కేంద్రాల్లో వయసుతో సంబంధం లేకుండా గేమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ జిల్లా నుంచి టాప్-4నిలిచిన వాళ్లు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే తుదిపోరులో తలపడుతారు. మొత్తంగా టోర్నీలో దాదాపు పదివేల మంది ప్లేయర్లు పోటీపడే అవకావముంది’ అని అన్నారు. మరోవైపు సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ పేరిట చెస్ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం.
జిల్లా స్థాయిలో పలు ఎన్జీవోలు, చెస్ అసోసియేషన్ల, క్రీడా సంఘాల సహకారంతో టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. 17న హైదరాబాద్లో జరిగే ఫైనల్లో విజేతలకు ట్రోఫీతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందచేస్తాం. ఖేలోఇండియా యూత్గేమ్స్లో పతకాలు సాధించిన వారితో పాటు క్రికెటర్లు త్రిష, యశశ్రీ, ఫిట్నెస్ ట్రైనర్ షాలినికి సన్మానం చేస్తాం’ అని అన్నారు.