హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నత విద్యామండలి ద్వారా కృషి జరుగాలని చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ సూచించారు. మంగళవారం కార్యాలయానికి వచ్చిన లింబాద్రిని సాట్స్ చైర్మన్ ఆత్మీయంగా సన్మానించారు. పాఠ్యాంశాల్లో క్రీడలను సిలబస్గా పొందుపర్చాల్సిన అవసరముందని, ఆ దిశగా విద్యామండలి, సాట్స్ సమన్వయంతో పనిచేస్తాయని అన్నారు.