IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) పకడ్బందీగా సిద్ధమవుతోంది. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)ను హెడ్కోచ్గా తెచ్చుకుంది. అయితే.. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) విషయంలో మాత్రం రాజస్థాన్ సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.
సంజూ సారథ్యంలో రాజస్థాన్ ఇప్పటివరకూ కప్పు కొట్టలేదు. అయినా సరే అతడిపై ఫ్రాంచైజీ నమ్మకం ఉంచింది. మరో ఏడాది కూడా అతడినే కెప్టెన్గా కొనసాగించడానికే రాజస్థాన్ యాజమాన్యం మొగ్గు చూపింది. 2025 ఎడిషన్లోనూ సంజూనే సారథిగా ఉంటాడని రాజస్థాన్ ఫ్రాంచైజీ తెలిపింది.
ఐపీఎల్ చిచ్చరపిడుగుల్లో ఒకడైన సంజూ 2021లో స్టీవ్ స్మిత్ నుంచి రాజస్థాన్ పగ్గాలు అందుకున్నాడు. ఆ తర్వాతి ఎడిషన్లోనే అతడు రాజస్థాన్ను ఫైనల్కు తీసుకెళ్లాడు. అయితే.. హర్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ సంజూ బృందానికి షాకిచ్చింది. అరంగేట్రం టోర్నీలోనే చాంపియన్గా అవతరించింది. ఇక.. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో టైటిల్ కొల్లగొట్టిన రాజస్థాన్ మళ్లీ ట్రోఫీని ముద్దాడింది లేదు. దాంతో, ఈసారి ద్రవిడ్, సంజూ జోడీ ఫ్రాంచైజీ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉంది.
Rahul Dravid, India’s legendary World Cup-winning coach, is set for a sensational return to Rajasthan Royals! 🇮🇳🤝
The cricket icon was captured receiving his Pink jersey from the Royals Sports Group CEO Jake Lush McCrum. It is believed that the RR Admin was present too,… pic.twitter.com/C6Q8KRDFgW
— Rajasthan Royals (@rajasthanroyals) September 6, 2024
హెడ్కోచ్గా రాజస్థాన్ గూటికి చేరిన ద్రవిడ్కు ఆ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది. టీమిండియా వాల్గా పేరొందిన ద్రవిడ్ ఐపీఎల్ కెరీర్లో 2012, 13లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అనంతరం 2014, 15లో అదే జట్టుకు మెంటార్గా సేవలందించాడు. ఆ తర్వాత ద్రవిడ్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు నాలుగు సీజన్ల పాటు మెంటార్గా పనిచేశాడు.